రవితేజ.. మళ్లీ రొటీన్ !

మాస్ మహారాజా రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడని చెప్పుకొన్నారు. అప్పటి వరకు రొటీన్ సినిమాలకు బోర్ కొట్టించిన రవితేజ.. రాజా ది గ్రేట్ కోసం అంధుడి పాత్రలో అదరగొట్టాడు. ఇక రవితేజ మారాడు. ఆయన నుంచి మరిన్ని హిట్స్ రావడం గ్యారేంటీ అని ఇండస్ట్రీలో చెప్పుకొన్నారు. ఐతే, ఆ ఆశలపై రవితేజ నీళ్లు చల్లాడు. టచ్ చేసి చూడు, నేల టికెట్ సినిమాలతో మళ్లీ పాత ఫార్మెట్ లోకి వెళ్లాడు. ఫలితంగా మళ్లీ ప్లాపులు పలకరిస్తున్నాయ్.

శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్భర్ ఆంథోనీ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఇలియానా టాలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో మాస్ మహారాజా మూడు పాత్రల్లో ఇరగదీస్తాడని ఆయన అభిమానులు అనుకొంటున్నారు. విశ్వసనీయ సమాచారమ్ ప్రకారం.. రవితేజ త్రిపాత్రాభినయం చేయడం లేదట.

ఇంటర్వెల్ వరకు రవితేజ మూడు పాత్రల్లో కనిపిస్తాడు. ఇంటర్వెల్ ముందు అవి మూడు పాత్రలు కాదు. ఒక్కడే ముగ్గురులాగా కనిపించాడనే ట్విస్టు రిలీవ్ అవుతుందని తెలిసింది. గతంలో రవితేజ ‘పవర్’ సినిమాలోనూ ఇదే ఫార్ములా చూపించారు. ఇప్పుడు శ్రీను వైట్ల సినిమాలోనూ అదే ఫార్ములాని ఫాలో అయిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే రవితేజ మళ్లీ రొటీన్ రొంపలోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇక, మాస్ మహారాజాని.. దేవుడే రక్షించాలి.