ప్రభాస్ చేతికి చరణ్ సినిమా

రామ్ చరణ్ సినిమా ప్రభాస్ చేతిలోకి వెళ్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘రంగస్థలం’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు చరణ్. ఈ సినిమా విజయాన్ని మెగా ఫ్యామిలీ, మెగా ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ప్రస్తుత్రం చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బ్యాంకాక్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ కొనసాగుతోంది. ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు.

బోయపాటి సినిమాలో యాక్షన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. చరణ్ సినిమాలోనూ యాక్షన్ అదిరిపోనుందని చెబుతున్నారు. దీనికి తోడు ఫ్యామిలీ సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయట. ఇప్పుడీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గుగానే ప్రీ-రిలీజ్ బిజిసె జరుగుతుంది. తాజాగా, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులని యూవీ క్రియేషన్స్ సొంతం చేసుకొంది. ఇందుకోసం భారీ మొత్తం చెల్లించబోతున్నట్టు సమాచారమ్. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత బ్యానర్ గా పిలుస్తుంటారు. ఈ లెక్కన చరణ్ సినిమా ప్రభాస్ చేతికి వెళ్లిందని చెప్పుకొంటున్నారు అభిమానులు

ఇక, చరణ్ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. సినిమాలో చరణ్ సరసన కైరా అద్వానీ జతకట్టనుంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్. డీవీవీ దానయ్య నిర్మాత.