అదితి రావ్ పంట పండింది

మణిరత్నం ‘చెలియా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరి. ఆ సినిమా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఐతే, సినిమాలో అదితి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అది అదితికి పెద్దగా అవకాశాలు తీసుకురాలేకపోయింది. కాస్త గ్యాప్ తర్వాత ‘సమ్మోహనం’ కోసం అదితిని తీసుకొన్నారు దర్శకుడు ఇంద్రగంటి. సుధీర్ బాబు-అదితి జంట తెరకెక్కిన సమ్మోహనం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

విమర్శకుల ప్రశంసలు అందుకొంది. కలెక్షన్స్ బాగున్నాయి. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీలోనూ అదరగొడుతోంది. ఇప్పుడీ సినిమా హీరోయిన్ అదితి రావ్ సూపర్ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారమ్. వంశీపైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేష్ 25వ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అదితిని తీసుకొన్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ అవకాశం ఉంది. ఇప్పుడా అవకాశం అదితికి దక్కిందని చెబుతున్నారు.

మహేష్ సినిమాలో అవకాశం అంటే అదితి పంట పండినట్టే. మహేష్ తో పాటు మిగితా టాలీవుడ్ స్టార్ హీరోలు అదితిపై ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. సమ్మోహనంతో అదితి చేసిన మాయ అలాంటిది. ఇదంతా చూస్తుంతే అదితి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.