మహేష్ కోసం అల్లు అరవింద్ ?

మెగా హీరోల కోసం అల్లు అరవింద్ రంగంలోకి దిగుతుంటాడు. వాళ్లకి మంచి కథలు సెట్ చేస్తుంటాడు. అవసరమైతే భారీ బడ్జెట్ పెట్టి.. బ్లాక్ బస్టర్ హిట్స్ అందిస్తుంటారు. ఇప్పుడీ మెగా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రంగంలోకి దిగుతున్నాడన్న న్యూస్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అల్లు అరవింద్ మహేష్ ని కలిసి చర్చలు జరిపారంట. మహేష్ కూడా ఓకే చెప్పేశాడని తెలిసింది. మంచి కథ, ఆ కథని డీల్ చేయగల దర్శకుడు దొరకడమే తరువాయి.. అరవింద్ నిర్మాతగా మహేష్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని చెబుతున్నారు.

ప్రస్తుతం వంశీపైడి పల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా తెరకెక్కుతోంది. తొలి షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ‘షుగర్ ఫ్యాక్టరీ’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. బహుశా.. అల్లు అరవింద్ నిర్మాత వ్యవహరించేది మహేష్ ‘షుగర్ ఫ్యాక్టరీ’ కోసమే కావొచ్చనే కామెంట్స్ వినబడుతున్నాయి.