ఢిల్లీ వార్ రూమ్ లో ఉత్త‌మ్..!

తెలంగాణ కాంగ్రెస్ లో మారుతున్న ప‌రిస్థితులు, తాజా రాజ‌కీయ ప‌రిణామాలు ఆ పార్టీలో రాజ‌కీయాల‌ను వేడెక్కెస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను అధిష్టానానికి వివ‌రించేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితి, నాయ‌కుల అసంతృప్తి అంశాల‌పై రాహుల్ తో చ‌ర్చించ‌నున్నారు ఉత్త‌మ్.

ఇప్ప‌టికే ఢిల్లీలో వార్ రూమ్ లో ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అశోక్ గెహ్లాట్ తో ఉత్త‌మ్ భేటీ అయ్యారు. కొత్తగా నియమించిన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు వారికి 40 నియోజకవర్గాల చొప్పున పని విభజించారు. ఈ నెల 25న పీసీసీ కార్యవర్గ, జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.