గ‌డ్క‌రీకి ఏపీ సీఎం లేఖ‌..!

కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌తిష్టాత్మ‌కమైన పోల‌వ‌రం విష‌యంలో వివ‌ర‌ణాత్మ‌కంగా గ‌డ్క‌రీకి వివ‌రించారు. పోలవరం నిర్మాణం, నిర్వాసితుల కోసం నిధుల విడుదల చేయాలని కోరారు.ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన 1504 కోట్లు తక్షణమే విడుదల చేయాలని లేఖ‌లో పేర్కొన్నారు. ప్పోలవరం నిర్మాణం, భూసేకరణ పరిహారం కోసం 10 వేల కోట్లు అవసరమ‌ని పేర్కొన్నారు. నిధుల విడుదల లో పెండింగ్ లేద‌న్న బీజేపీ నేతల వ్యాఖ్యలను సీఎం చంద్ర‌బాబు త‌ప్పుబ‌ట్టారు. తాజాగా సవరించబడిన పోలవరం ప్రాజెక్ట్ అంచనాల ప్రకారం 57,940 కోట్లకు చేరిందని లేఖలో వెల్లడించారు సీఎం. ఇప్పటికే సి.డబ్ల్యూ. సి కి పంపిన నూతన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. .