సుష్మా స్వరాజ్ నూ బీజేపీ టార్గెట్ చేసింది..!!

హిందు, ముస్లిం దంపతుల పాస్ పోర్ట్ విషయంలో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ వివక్ష చూపినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. సుష్మా స్వరాజ్ వారి పై చర్యలు తీసుకుందని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. సుష్మా స్వరాజ్ దేశంలో లేనప్పుడు స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్ అనుచరులు చెప్ప‌రాని భాష‌ను ఉప‌యోగించార‌ని ఆయ‌న అన్నారు. సోషల్ మీడియాలో సుస్మా స్వరాజ్ పై మురికి దాడి చేస్తున్నారని, బీజేపీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆయ‌న అన్నారు. సుష్మాపై సోష‌ల్ మీడియాలో దాడిని తాను ఖండిస్తున్నానన్నారు.

సొంతపార్టీ నేతలను సైతం టార్గెట్ చేయడం శోచనీయమ‌ని జైపాల్ రెడ్డి అన్నారు. మోడీ సామాజిక మాధ్యమ సైన్యం హిట్లర్ సేనను తలపిస్తోందన్నారు. మోడీకి ప్రత్యామ్నాయంగా ఉందనే సుష్మాస్వరాజ్ మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. బీజేపీలో పుట్టిన‌వారంతా రాక్ష‌సులే అని ఆయ‌న విమ‌ర్శించారు. కేసీఆర్ ప‌థ‌కాల‌న్నీ విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని, ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా కాంగ్రెస్ దే విజ‌య‌మ‌ని ఆయ‌న ధీమాగా చెప్పారు. త‌మ మ‌ధ్య ఎన్ని విభేదాలున్నా ఎ న్నిక‌ల‌నాటికి ఒక్క‌ట‌యి కేసీఆర్ ను ఓడిస్తామ‌న్నారు. టికెట్లు ప్ర‌క‌టించాక కేసీఆర్ కు త‌మ‌కంటే ఎక్కువ ఇక్క‌ట్లు ఎదుర‌వుతాయ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్ర‌జ‌ల‌కంటే పైస‌ల‌నే ఎక్కువ ప‌ట్టించుకుంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.