ప్ర‌ధానికి కేటీఆర్ విన‌తులు..

మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్రమోదీని క‌లిసారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రధానిని కలుసుకున్న గ్రూపు ఫొటో కూడా పోస్ట్ చేశారు. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) కు సంబంధించి అదనపు సమాచారం కావాలని కోరడంతో, ఆ సమాచారాన్నిఆయ‌న‌కు అందించామ‌ని కేటీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా బ‌య్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీని గుర్తు చేశాన‌ని చెప్పారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందజేసినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధానిని కలుసుకున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనకు శాలువా కప్పి హారిత హారం మొక్కను అందజేశారు.