మా మ‌ధ్య అభిప్రాయ భేదాలు లేవు…

స్టేష‌న్ ఘ‌న్పూర్ ప్ర‌జ‌ల ఆశీర్వాదం వ‌ల్లే తాను ఈ స్థితిలో ఉన్నాన‌ని ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి అన్నారు. ఎన్ని జ‌న్మ‌లెత్తినా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల రుణం తీర్చుకోలేనిద‌ని అన్నారు. తాను ఎప్పుడూ త‌ప్పు చేయ‌లేద‌ని, చేయ‌బోన‌ని ఆయ‌న తెలిపారు. ఇన్నేళ్ల త‌న రాజ‌కీయ జీవితంలో లంచం తీసుకోలేద‌న్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలోని తాటికొండ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయ‌న ఈ వ్యాక్య‌లు చేశారు.

స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌కు త‌న‌కు ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవ‌ని ఆయ‌న తెలిపారు. తాము క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని, ఏ అవ‌కాశ‌మైనా పార్టీ ఇస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశానుసార‌మే తాము ప‌నిచేస్తామ‌న్నారాయ‌న‌. స్టేష‌న్ ఘ‌న్పూర్ అభివృద్ధ‌కి పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని తెలిపారు. గ‌తంలో తాను నీటిపారుద‌ల మంత్రిగా ఉన్న‌ప్పుడు దేవాదుల ప్రాజెక్టును తీసుకువ‌చ్చాన‌ని, ఉప‌ముఖ్య‌మంత్రిగా ఇప్పుడు లింగంప‌ల్లి ప్రాజెక్టు తీసుకువ‌చ్చామ‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ‌తామ‌ని, త‌న‌కు రాజ‌య్య‌కు ఎలాంటి విబేధాలు లేవ‌న్నారు.