తెలంగాణ‌లో అమిత్ షా యాత్ర‌..!

తెలంగాణ‌లో బీజేపీ బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా జ‌న‌చైత‌న్య యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పర్య‌టించే ప‌నిలో ప‌డ్డారు బీజేపీ నేత‌లు. రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ సార‌థ్యంలో యాదాద్రిలో ప్రారంభ‌మైన ఈ యాత్ర వివిధ జిల్లాల్లో కొన‌సాగుతోంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, కాంగ్రెస్ పార్టీ వైఖ‌రిపై తీవ్ర విమ‌ర్శలు చేస్తూ ముందుకు సాగుతోంది యాత్ర‌. విప‌క్షాల‌పై మ‌రింత డోస్ పెంచుతూ విమ‌ర్శ‌ల బాణాల‌ను సందిస్తున్నారు ల‌క్ష్మ‌ణ్. ఈ నేప‌థ్యంలో ఓ వార్త ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో మ‌రింత జోష్ నింపుతోంద‌ట‌.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ కు ఫోన్ చేశార‌ట‌. ఈ సంద‌ర్భంగా జ‌న‌చైత‌న్య యాత్ర స‌క్సెస్ అయినందుకు ల‌క్ష్మ‌ణ్ అమిత్ షా అభినందించారు. జూలై 13న తెలంగాణ‌కు వ‌స్తున్న అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌న‌చైత‌న్య యాత్ర‌లో పాల్గొంటాన‌ని హామీ ఇచ్చార‌ట‌. అమిత్ షా రాక‌తో జ‌న చైత‌న్య యాత్ర మ‌రింత విజ‌య‌వంత‌మ‌వుతుంద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు.