‘సంజు’కి షాక్.. ఆన్ లైన్’లో మొత్తం సినిమా !

రాజు కుమార్ హిరాని దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ‘సంజు’గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ బయోపిక్ నిన్న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. సంజయ్ దత్ గా రణ్ బీర్ కపూర్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. హిట్ టాక్ తో ఆనందంలో ఉన్న ‘సంజు’ చిత్రబృందానికి పెద్ద షాక్ తగిలింది.

సినినిమా విడుదలైన కొద్దిగంటల్లోనే పైరసీ అయ్యింది. డివిడి ప్రింట్ తో మొత్తం సినిమా బయటికొచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని కొందరు నెటిజర్స్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. పైరసీ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడనుంది. మరోవైపు, అప్రమత్తమైన చిత్రబృందం పైరసీ లింకులని తొలగించే పనిలో ఉన్నట్టు సమాచారమ్.

సంజయ్ దత్ బయోపిక్ కావడం. దాన్ని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ టెకప్ చేయడంతో.. ఈ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా 4000థియేటర్స్ లో సంజు రిలీజైంది. తొలి రోజే కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇంతలో పైరసీ షాక్ చిత్రబృందంలో ఆనందాని ఆవిరి చేసింది.