మెహ్రీన్’కు మరో చేధు అనుభవం

టాలీవుడ్’లో రాణిస్తున్న యంగ్ హీరోయిన్స్’లో మెహ్రీన్ కౌర్ ఒకరు. ఈ పంజాబీ ముద్దుగుమ్మ చేతినిండా సినిమాలున్నాయి. స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు అన్నీ విధాల ప్రయత్నిస్తోంది. ఐతే, ఈ మధ్య మెహ్రీన్ షాక్ గురయ్యే సంఘటనలు ఎదురవుతున్నాయి. ఇటీవలే అమెరికా వెళ్లిన ఆమెకు అక్కడి అధికారులు షాకిచ్చిన సంగతి తెలిసిందే. యుఎస్ లో టాలీవుడ్ హీరోయిన్స్ సెక్స్ రాకెట్ బట్టబయలు అయిన నేపథ్యంలో.. మెహ్రీన్ అనుమానించారు. ఆమెని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజనిజాలు తెలుసుకోకుండా యుఎస్ సెక్స్ రాకెట్ లో మెహ్రీన్ కు సంబంధాలున్నాయనే రాతలు రాశారు. ఇక, విచారణ అనంతరం మెహ్రీన్ కు యుఎస్ అధికారులు సారీ చెప్పి పంపించారనుకోండీ.. !

తాజాగా, మెహ్రీన్ ఎదుర్కొన్న మరో చేధు అనుభవం వెలుగులోనికి వచ్చింది. తమిళ్ సినిమా ‘నోటా’లో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం మెహ్రీన్ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. ఐతే, ఆమెకు ఫ్లైట్ టికెట్ దొరక్కపోవడంతో.. ట్రైయిన్ లో రావాల్సిందిగా నిర్మాత రిక్వెస్ట్ చేశారు. అందుకోసం టికెట్ కూడా బుక్ చేశారు. తీరా ట్రెయిన్ ఎక్కిన మెహ్రీన్ కు షాక్ తగిలింది. అప్పటికే ఆమె బెర్తుపై ఎవరో ఫుల్ గా మందుకొట్టి పడుకొన్నాడు. ఆయన్ని కదిపేందుకు కూడా భయపడిన మెహ్రీన్ చాలా సేపు నిల్చొనే ఉందట.

చివరికి నిర్మాతకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో.. ట్రైయిన్ తర్వాతి స్టేషన్ కి చేరుకొనెలోగా కారుని పంపించారు. ఆ కారులో మెహ్రీన్ షూటింగ్ స్పాట్ కు వెళ్లింది. ఈ విషయాన్ని ‘నోటా’ సినిమా బృందంలోని ఓ వ్యక్తి బయటపెట్టాడు. ఇది విన్న జనాలు పాపం.. మెహ్రీన్. ఈ మధ్య అస్సలు కలిసిరావడం లేదని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.