‘టాయ్ లెట్ 2’పై అక్షయ్ ట్విట్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌’ది విభిన్న శైలి. ఆయన సినిమాల ఎంపిక బావుటుంది. అందులోనూ సామాజిక అంశాలు, నిజ జీవిత సంఘటలపై దృష్టిపెట్టి ప్రేక్షకులకు ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలనుకునే నటుల్లో అక్షయ్ ఒకరు. ఇందుకు ‘ఎయిర్‌లిఫ్ట్‌’, ‘రుస్తుం’, ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా’ చిత్రాలే ఉదాహరణ. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్‌’ క్యాంపెయిన్‌ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్షయ్ ‘టాయ్ లెట్’ బాలీవుడ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకొంది. శ్రీ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ కి జంటగా భూమి పెడ్నేకర్‌ నటించింది.

ఇంట్లో మరుగుదొడ్డి లేదన్నకారణంగా పెళ్లి రద్దుచేసుకుంటున్న మహిళల స్ఫూర్తితో ఈ చిత్ర కథనురూపొందించారు. ఓ పక్క హీరో, హీరోయిన్ల మధ్య అల్లుకున్న ప్రేమకథను చెప్తూనే మరో పక్క దేశంలో బహిర్భూమికి వెళ్లలేక మహిళలు పడుతున్న ఇబ్బందులను దాని వల్ల కలిగే దుష్పరిణామాలను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ కధ చెప్పే విధానం మాత్రం ఆకట్టుకుంది. ‘టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ’ చిత్రం ఈ మధ్యే చైనాలో ‘టాయ్‌లెట్‌ హీరో’గా విడుదలై రూ.100కోట్లు దాటి వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతుంది.

ఈ విషయాన్ని అక్షయ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. “మరో బ్లాక్‌ బస్టర్‌కు సిద్ధంకండి.. మిషన్‌ టాయ్‌లెట్‌ 2’ అంటూ ట్వీట్‌ చేశాడు అక్షయ్. దీంతోపాటు ఓ వీడియోను కూడా పంచుకొన్నాడు. ‘‘టాయ్‌లెట్‌తోనే కథ అయిపోలేదు. టాయ్‌లెట్‌ 2’తో వస్తున్నాం’ అని ఈ వీడియోలో చెప్పాడు.