క‌మ్యూనిస్టుల‌పై సీపీఐ నారాయ‌ణ షాకింగ్ కామెంట్స్..!!

క‌మ్యూనిస్టుల్లో రోజురోజుకు విలువ‌లు త‌గ్గిపోతున్నాయ‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయణ అన్నారు. గ‌తంతో పోల్చుకుంటే ఇప్పుడు క‌మ్యూనిస్టుల ప్ర‌వ‌ర్త‌న‌లో కూడా మార్పులొస్తున్నాయ‌ని ఇది మంచిది కాద‌ని చెప్పారాయ‌న‌. రాజ‌కీయాల్లో ప్ర‌స్తుత ప‌రిణామాల‌కు త‌గిన‌ట్టుగా వివిధ రాజ‌కీయ పార్టీల వైఖ‌రిలో మార్పులొస్తున్నాయ‌న్నారు. ఏ పార్టీలో మార్పులు వ‌చ్చినా క‌మ్యూనిస్టుల్లో మార్పు రావ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌న్నారు నారాయ‌ణ‌.

కొండాపూర్ లోని ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అనంత‌రం ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో రాజకీయ పార్టీలకు, నేతలకు విలువలు లేకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. క‌మ్యూనిస్టులు సిద్ధాంతాల‌ను అవ‌గాహ‌న చేసుకుంటూ, నిబ‌ద్ధ‌త‌గా నడుచుకుంటూ ఆ దిశ‌గా స‌మాజ‌సేవ‌కు అంకిత‌మ‌వ్వాల‌ని లేక‌పోతే క‌మ్యూనిజానికే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని అన్నారు ఆయ‌న‌.