సురేష్ బాబుతో శ్రీరెడ్డికి బేరం కుదిరిందిగా.. !

నటి శ్రీ రెడ్డి వ్యవహారం టాలీవుడ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్’ని ఆధారాలతో బయటపెట్టింది. ఈ క్రమంలో ఇండస్ట్రీ తనని వ్యభిచారిగా మారించిందని ఆరోపించింది. కొందరు వ్యక్తులు తనని వాడుకొన్నారని, వారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలని సైతం బయటపెట్టింది. వీరిలో నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కూడా ఉన్నారు. అభిరామ్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని వాడుకొన్నాడని చెప్పిన శ్రీ రెడ్డి అతనితో సన్నిహితంగా దిగిన ఫోటోలని బయటపెట్టింది. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ తర్వాత సురేష్ బాబుని మామ, రానాని బావా అంటూ సంబోధించింది.

ఇదీగాక, సురేష్ బాబు తనకు డబ్బులిచ్చి నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకోసం మధ్యవర్తిత్వం నడిపిస్తాడని ఆరోపించింది. ఆ తర్వాత కూడా ఒకట్రెండు సార్లు దగ్గుపాటి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. ఐతే, ఇప్పుడు దగ్గుపాటి ఫ్యామిలీతో శ్రీ రెడ్డికి బేరం కుదిరినట్టు సమాచారమ్. శ్రీరెడ్డితో అభిరామ్ కు లింకు బయటపడిన తర్వాత సురేష్ బాబు మీడియా ముందుకు రాలేదు. మీడియా కనబడితే తప్పించుకొని తిరిగారు. అలాంటిది ఇప్పుడు సురేష్ బాబు స్వేచ్ఛగా మీడియా ముందుకు వచ్చేశారు.

సురేష్ బాబు బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ రెడ్డి ఏపీసోడ్ పై స్పందించారు. ఇప్పుడా సమస్య తీరిందని అన్నారు. దీంతో సురేష్ బాబుతో శ్రీరెడ్డికి బేరం కుదిరినట్టుందనే ప్రచారం మొదలైంది. డ్రగ్స్, సెక్స్ మానవ సంబంధింత సంబంధాలని సురేష్ బాబు అన్నారు. ఇంతకీ శ్రీ రెడ్డిని ఎన్ని కోట్లతో కొట్టివుంటారో… !?