వీఆర్ఓ దరఖాస్తు గడువు పొడిగింపు

వీఆర్ఓ దరఖాస్తు గడువుని టీఎస్ పీఎస్ సీ పొడిగించింది. సోమవారం (జులై 2)తో వీఆర్ వో, ఏఎస్ వో, సీసీఎల్ ఏ, హోంశాఖ స్టెనో ఉద్యోగాలకు దరఖాస్తు ముగియాల్సి ఉంది. ఐతే, గడువు ముగుస్తుండటంతో దరఖాస్తుల తాకిడి భారీగా పెరగడంతో టీఎస్ పీఎస్ సీ సర్వర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అభ్యర్థుల విజ్ఝప్తి మేరకు దరఖాస్తు గడువుని టీఎస్ పీఎస్ సీ పొడిగించింది. దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల 8వరకు అవకాశం కల్పించింది.

ఆఖరి రోజు సెకనుకు 12వేల దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్ పీఎస్ సీ తెలిపింది. ఆ కారణంగానే సర్వర్ లో సమస్య తతెత్తినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 700పోస్టులకు గానూ టీఎ పీఎస్ సీ గత నెల 8న (జూన్ 8) నోటీఫికేషన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తుది గడువుని జులై 2గా విధించింది. ఇప్పుడా డేటు జులై 8కి మారింది.