రేష‌న్ డీల‌ర్ల చ‌ర్చ‌లు స‌ఫ‌లం

తెలంగాణ‌లో ప్ర‌భుత్వంపై స‌మ్మెకు దిగిన రేష‌న్ డీల‌ర్లు స‌మ్మె విర‌మించారు. గ‌త కొన్ని రోజులుగా ఆందోళ‌న బాట ప‌ట్టిన రేష‌న్ డీల‌ర్ల డిమాండ్ల‌పై మంత్రి ఈటెల జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయి. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో రేష‌న్ డీల‌ర్ల‌తో మంత్రి ఈటెల రాజెంద‌ర్ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో రేష‌న్ డీల‌ర్ల స‌మ్మెపై మంత్రి ఈటెల చ‌ర్చించారు. రేష‌న్ డీల‌ర్ల‌తో మ‌రోద‌ఫా మంత్రి చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

పెండింగ్ బ‌కాయిలు విడ‌త‌ల వారిగా విడుద‌ల చేయ‌డంతో పాటు డీల‌ర్ల క‌మిష‌న్ పెంపుపై మంత్రి హామీ ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డీల‌ర్ల‌కు క‌మిష‌న్ ఉంటుంద‌ని మంత్రి వారికి తెలిపారు. అతి త్వ‌ర‌లోనే బ‌కాయిలు, క‌మిష‌న్’పై ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని మంత్రి ఈటెల రాజేంద‌ర్ తెలిపారు. ఈ స‌మావేశంలో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి, మంత్రి ల‌క్ష్మారెడ్డి పాల్గొన్నారు.