వ‌రంగ‌ల్ జిల్లాలో భారీ పేలుడు.. !!

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా కోటిలింగాల గుడి స‌మీపంలో భారీ పేలుడు జ‌రిగింది. భ‌ద్ర‌కాళి ఫైర్ వ‌ర్క్స్ లో ఒక్క‌సారిగా జ‌రిగిన పేలుడుతో మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. కంపెనీలో ఉన్న మందుగుండు సామాగ్రి ఒక్కొక్క‌టిగా పేలుతుండ‌టంతో స్థానికంగా భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది. పేలుడు ధాటికి అందులో ఉన్న కార్మికులు మృతిచెందారు. మృత‌దేహాల‌ను గుర్తుప‌ట్ట‌లేనంత‌గా కాలిపోయి,ఛిద్ర‌మ‌యిపోయి క‌నిపిస్తున్నాయి.

భారీ ఎత్తున మంటలు ఎగిసిప‌డుతున్నాయి. ఆకాశంలోకి దూసుకెళ్తున్న రాకెట్ బాంబులతో భారీ శబ్దాలతో ప‌రిస‌ర ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి . నాలుగు పైర్ ఇంజన్ లతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందిసంఖ్య పెరిగే అవకాశం ఉంది. వ‌రంగ‌ల్ ఘ‌ట‌న‌పై సీఎల్పీ నేత జానారెడ్డి, ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.