ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

వ‌రంగ‌ల్ జిల్లా కోటిలింగాల గుడి స‌మీపంలో భ‌ధ్ర‌కాళి ట‌పాసుల త‌యారీ కంపెనీలో జ‌రిగిన భారీ పేలుడు జ‌రిగి దాదాపు 10మంది మృతిచెందారు.ప‌లువురికి గాయాల‌య్యాయి. ప్ర‌మాదం జ‌రిగిన తీరు అంద‌రినీ క‌ల‌చి వేసింది. విష‌యం తెలుసుకున్న జిల్లా మంత్రి, డిప్యూటీ సీఎం క‌డియం ప్ర‌మాద ఘ‌ట‌నా స్థ‌లాన్ని సంద‌ర్శించారు. మృతుల కుటుంబాల‌కు ఐదు ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తామ‌ని క‌డియం హామీ ఇచ్చారు. క్ష‌త‌గాత్రుల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా వైద్యసాయం అందిస్తామ‌న్నారాయ‌న‌. ప్ర‌మాద స్థ‌లి చుట్టుప‌క్క‌ల దెబ్బ‌తిన్న ఇళ్ల‌వివ‌రాల‌ను సేక‌రించి వారికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని చెప్పారు. గ్రేట‌ర్ ప‌రిధిలో ఎన్ని ట‌పాసుల త‌యారీ కేంద్రాలున్నాయో ఎంక్వైరీ చేయాల‌ని క‌డియం శ్రీ‌హ‌రి అధికారుల‌ను ఆదేశించారు.