ట్విట్ట‌ర్ లో బీజేపికి మంత్రి లోకేష్ ఘాటు హెచ్చ‌రిక‌..!!

బీజేపీ తీరుపై మంత్రి లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ఇవ్వాల్సింది ఏమీలేదు , అంతా ఇచ్చేసామంటూ కేంద్ర ప్ర‌భుత్వం అఫిడ‌విట్ స‌మ‌ర్పించ‌డాన్ని మంత్రి నారాలోకేష్ త‌ప్పుబ‌ట్టారు. కేంద్ర అఫిడ‌విట్ పై ఆయ‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు బీజేపీ తీర‌ని ద్రోహం చేసింద‌ని, ఇది బీజేపీ మోస‌పూరిత వైఖ‌రికి ప‌రాకాష్ట‌గా వ‌ర్ణించారాయ‌న‌. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా ప్ర‌జ‌ల న‌డ్డి విరిస్తే, ఇప్పుడు బీజేపీ న‌మ్మించి మోసం చేసింద‌ని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. ఏపీ ప్ర‌జ‌లు బీజేపీకి ఎప్పుడూ మ‌రిచిపోలేని గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు నారా లోకేష్.