వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌మాదంపై స్పందించిన ప‌వ‌న్..!

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా కోటిలింగాల వ‌ద్ద జరిగిన ప్ర‌మాదంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ప్ర‌మాదంలో కార్మికులు మ‌ర‌ణించ‌డంపై ఆయ‌న దిగ్బ్రాంతికి గుర‌య్యారు. బాణ‌సంచా త‌యారీ గోదాములో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో మృతిచెంద‌ని కుటుంబాల‌ను అన్నివిధాలా ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారాయ‌న‌. మృతుల కుటుంబాల‌కు ఆయ‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని, భ‌విష్య‌త్ లో ఇలాంటి దుర్ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ప్రభుత్వం ఉంద‌ని ఆయ‌న అన్నారు.