ఆ ఐదుగురు పిల్ల‌లను ద‌త్త‌త తీసుకున్న టీడీపీ..!

వ‌రంగ‌ల్ జిల్లాలో ట‌పాకాయ‌ల త‌యారీ కంపెనీలో జ‌రిగిన పేలుడు ఘ‌ట‌న అంద‌రి హృద‌యాల‌ను క‌లిచివేసింది. వరంగల్ అర్బన్ జిల్లా యస్ఆర్ నగర్ లోని భద్రకాళి పైర్ వర్కులో జ‌రిగిన భారీ అగ్ని ప్ర‌మాదంలో ప‌ది మంది మృతి చెందారు. చాలామందికి గాయాల‌య్యాయి. మృతిచెందిన వారిలో వినోద్, ఎల్లమ్మ, రాధికా, అశోక్, కనకరాజ్, మ‌ణెమ్మ‌, ర‌ఘుప‌తి, శ్రీ‌వాణి, శ్రావ‌ణి, హ‌రికృష్ణ గా గుర్తించారు. సంఘ‌ట‌నా స్థ‌లాన్ని టీడీపీ నేత‌లు సంద‌ర్శించారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు త‌మ వంతుగా సాయ‌మందించేందుకు ముందుకు వ‌చ్చారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మృతిచెందిన శ్రీవాణి, శ్రావణిల పిల్లలను ద‌త్త‌త తీసుకుని ఎన్టీఆర్ ట్ర‌స్టు ద్వారా చ‌దివిస్తామ‌ని టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఈగ మ‌ల్లేశం ప్ర‌క‌టించారు. ఐదుగురు పిల్ల‌ల ఆర్థిక సాయాన్ని అందించారు టీడీపీ నేత‌లు.