‘అరవింద సమేత’ని అప్పుడే చూసేశాడు.. ! మైండ్ బ్లోయింగ్ అట !!

తారక్ – త్రివిక్రమ్’ల ‘అరవింద సమేత’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిపోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రూ. 80కోట్లకు అమ్ముడు పోయినట్టు చెబుతున్నారు. కొందరు ‘అరవింద సమేత’ని అప్పుడే చూసేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు సెన్సేషనల్ ట్వీట్ చేశారు.

‘నాకు తెలిసిన కొందరు ఇప్పటికే ‘అరవింద సమేత’ రష్ ప్రింట్‌ను చూశారు. సినిమా మైండ్ బ్లోయింగ్‌ ఉంది. తారక్ నటన గురించి మాటల్లో చెప్పలేం. సినిమాలో తారక్ గెటప్ అదిరిపోయింది. టాలీవుడ్‌కు మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ’ అని చెప్పారని ట్విట్ చేశారు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో ‘అరవింద సమేత’ తెరకెక్కుతోంది. ఇందులో తారక్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో ఫ్యాక్షనిస్టు లీడర్ పాత్ర ఒకటి. అది మాస్ ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుందని చెబుతున్నారు. ఎన్ టీఆర్ పుట్టినరోజు కానుకగా వదిలిన ఫస్ట్ లుక్ కూడా ఆ రేంజ్ లో ఉంది. ఇదీగాక, సినిమాలో రాయసీమ యాసలో వచ్చే డైలాగ్స్ బాగా ఆకట్టుకొంటాయని చెబుతున్నారు. రాయల సీమ యాసపై మంచి పట్టున్న రచయిత పెంచల్ దాస్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

ఈ చిత్రంలో తారక్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. సంగీతం థమన్. ఎస్. రాథాకృష్ణ నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 11న ‘అరవింద సమేత’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.