జ‌న‌సేన‌లోకి మెగాస్టార్ ఫ్యాన్స్..!!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీలో చేర‌నున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేష‌న్ అధ్యక్షుడు స్వామినాయుడు జనసేనపార్టీలో చేరనున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం స్వామినాయుడు రంగం సిద్ధం చేసుకున్నారట‌. అయితే చిరంజీవితో భేటీ అయ్యాకే జనసేనలోకి వెళ్లాలని స్వామినాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్వామినాయుడుతో పాటు చిరంజీవి ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్య‌లో జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.