అప్పుడు త్రివిక్రమ్ చెప్పింది నిజమే.. !

దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని ‘అజ్ఝాతవాసి’గా చూపించిన సంగతి తెలిసిందే. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అజ్ఝాతవాసి’ అట్టర్ ప్లాపుగా నిలిచింది. దీంతో.. ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు తప్పలేదు. ఐతే, నష్టాలని త్రివిక్రమ్, పవన్ లు కలిసి చాలా వరకు పూడ్చారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ విషయంపై పవన్ కూడా స్పందించారు. తాజాగా, జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ‘అజ్ఝాతవాసి’ సినిమా ఫెయిల్ కావడంతో తన పారితోషికం తిరిగిచ్చేసినట్టు తెలిపారు. దీంతో అప్పుడు త్రివిక్రమ్ చెప్పింది నిజమేనని స్పష్టమైంది.

సాధారణంగా పవన్ తను చేసిన ఆర్థిక సాయం గురించి ఎప్పుడు స్పందించారు. చాలా సైలైంట్ గా సాయం చేస్తుంటాడు. గతంలోనూ ఆయన చేసిన సినిమాలు ఫ్లాపు అయినప్పుడు నిర్మాతలని ఆదుకొన్న సందర్భాలున్నాయి. ఐతే, ఏనాడు పవన్ తాను పలాన నిర్మాతని ఆదుకొన్నా. తన రెమ్యూనరేషన్ ని తిరిగిచ్చేశానని చెప్పలేదు. ఫస్ట్ టైం.. అజ్ఝాతవాసి విషయంలో తన రెమ్యూనరేషన్ తిరిగిచ్చేశానని తెలిపారు. బహుశా… ఈ విషయాన్ని ఇప్పటికే త్రివిక్రమ్ చెప్పేశాడు. ఆ కారణంతోనే పవన్ ఓపెన్ అయి ఉంటాడు. త్రివిక్రమ్ చెప్పింది నిజమేనన్నట్టుగా క్లారిటీ ఇచ్చేశారు.