ధ‌ర‌లు త‌గ్గించిన శాంసంగ్ మొబైల్స్…

శాంసంగ్ మొబైట్ క‌స్ట‌మ‌ర్ల‌కు శుభవార్త . భారత మార్కెట్‌లో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లు, శాంసంగ్ గెలాక్సీ ఏ6ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై భారీగా ధరలను తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ6ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై 2,000 వరకు తగ్గించినట్లు సంస్థ పేర్కొంది. తగ్గించిన ధరతో ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఏ6ప్లస్ స్మార్ట్‌ఫోన్ 23,990 లభిస్తోందని కంపెనీ స్పష్టం చేసింది. పేటీఎం మాల్స్, అమెజాన్ స్టోర్ల ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. తగ్గించిన ఫోన్ల ధరలపై అదనంగా పేటీఎం మాల్ 3,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇచ్చింది.