పాపం.. బంగారు ‘బిందె’కు క్యాన్సర్

టాలీవుడ్ లో రాణించిన బాలీవుడ్ హీరోయిన్ సోనాలీ బింద్రే. ఇప్పుడీ సీనియర్ హీరోయిన్ కు పెద్ద కష్టమే వచ్చింది. ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకింది. ఈ విషయాన్ని స్వయంగా సోనాలీనే తెలిపింది. “తనకు హై గ్రేడ్ కేన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయింది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించింది. అదే పనిగా నొప్పి వేధిస్తుండడంతో పరీక్షలు నిర్వహించగా ఊహించనది బయపడింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు మద్దతుగా నిలిచారు. అందరికీ ధన్యావాదాలు’’ అని బింద్రే ట్వీట్ చేసింది.

టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబులతో సోనాలీ జతకట్టింది. ఆమె నటించిన ప్రేమికుల రోజు, మన్మథుడు, ఇంద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌, మురారి, ఖడ్గం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. తెలుగు ప్రేక్షకులకు దొరికిన బంగారు ‘బిందె’ అనిపించుకొంది. తమ బంగారు బిందె క్యాన్సర్ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

సొనాలి క్యాన్సర్‌ బారిన పడటంపై హీరో నాగార్జున స్పందించారు. ‘నువ్వు త్వరగా కోలుకోవాలని, నీ ఆత్మస్థైర్యానికి ఇంకా బలం చేకూరాలని ఆశిస్తున్నా’నంటూ ట్వీట్‌ చేశారు నాగ్. వీరిద్దరు కలిసి నటించిన ‘మన్మథుడు’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.