నేటి ‘ఏపీ కేబినేట్’లో చర్చించనున్న అంశాలివే !

శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే మంత్రులు, సంబంధిత అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ లో మాట్లాడిన సీఎం చంద్ర‌బాబు కేబినెట్ లో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

నిరుద్యోగ భృతి విధివిధానాల‌పై ఏపీ కేబినెట్ ఆమోద‌ముద్ర వేయ‌నుంది . విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు అమ‌లుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నుంది. విభ‌జ‌న హామీల‌పై సుప్రీం కోర్టులో కేంద్రం ఇచ్చిన అఫిడ‌విట్ పై కేబినెట్ లో చ‌ర్చిచ‌నున్నారు. కేంద్రం తీరుపై ప్ర‌త్యేక నివేదిక రూపొందించి తీర్మాణం చేయ‌నున్నారు. ఈనెల 16 నుంచి ప్రాంరంభం కానున్న గ్రామ ద‌ర్శిని కార్య‌క్ర‌మంపై కేబినెట్లో చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.