సీఎంతో విభేదాల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చిన మంత్రి గంటా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుతో మంత్రి గంటాకు విభేధాలు వ‌చ్చాయంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆయ‌న స్ప‌ష్ట‌త‌నిచ్చారు. సీఎం చంద్ర‌బాబుకు త‌న‌కు ఎలాంటి భేధాభిప్రాయాలు లేవ‌ని తేల్చి చెప్పారు. ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ పై కూడా ఆయ‌న స్ప‌ష్ట‌త‌నిచ్చారు. కొన్ని కారణాలతో డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని, ఆర్థిక శాఖ నుంచి ఇంకా అనుమతి రాలేద‌ని ఆయ‌న అన్నారు. NCTE ఆదేశాలపై స్పష్టత తీసుకోవాల్సి ఉంద‌ని చెప్పారు. వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామ‌ని తెలిపారు. టెట్,టెట్ కం టీఆర్టీ నిర్వహించడం పై పరిశీలన చేస్తున్నామ‌ని చెప్పారు మంత్రి గంటా..