ఆ లింకు సింకు కాలేదు పవన్

ఏపీలో టీడీపీ నేతలు పవన్ విషయంలో ఒకే మాట మీదున్నారు. పవన్’కు బీజేపీ కనబడటం లేదా ? ఆయన ఎందుకు బీజేపీ పై పోరాటం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలు ఎవరు మీడియా ముందుకొచ్చిన పవన్ ని ఇదే పాయింట్ తో కొడుతున్నారు. తాజాగా, ఈ ప్రశ్నకు పవన్ నుంచి సమాధానం వచ్చింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు. అప్పుడు జగన్, చంద్రబాబుతో కలిసి విశాఖ రైల్వే జోన్‌ కోసం పోరాడేందుకు సిద్ధం. ముగ్గురం కలిసి రైళ్లను స్తంభింపజేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకుకి ప్రధాని మోదీ అంటే భయం. తనకు అలాంటి భయాలేవీ లేవని చెప్పారు.

ప్రత్యేక హోదాపై తొలి నుంచీ కేంద్రంతో పోరాడుతోంది జనసేన పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి, విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేసేందుకు పవన్ పెట్టిన లింకు సింకు కాలేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. జనసేన శ్రేణులు మాత్రం పవన్ బాబుపై సటైర్ వేశాడు. అధికారంలో ఉండి రైల్వే జోన్ తేలేకపోయారని విమర్శించారు చెబుతున్నారు.