సమంత ఎంత చెప్పినా.. మళ్లీ అదే ప్రచారం !

చైతూతో పెళ్లి తర్వాత హీరోయిన్ సమంత సినిమాలకు దూరం అవుతుందని అందరు భావించారు. ఐతే, పెళ్లి తర్వాత సమంతలో ఏ మార్పు రాలేదు. ఎప్పటిలాగే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. పైగా పెళ్లి సామ్’కు బాగా కలిసొచ్చింది. ఆమె నటించిన వరుస సినిమాలు మెర్సల్, రంగస్థలం, మహానటి, అభిమన్యుడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇవిగాక, మరో మూడు సినిమాలని సామ్ పూర్తి చేసింది. ఇందులో ‘యు-టర్న్’ రిమేక్ ఒకటి. మిగిలిన రెండు తమిళ్ సినిమాలు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇదే సమయంలో సమంత సినిమాలకు గుడ్ చెప్పనుంది అనే ప్రచారం మళ్లీ మొదలైంది. ప్రచారంపై సమంత గతంలోనే క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలు చేస్తా. ఎప్పటిలాగే అభిమానులని అలరిస్తానని క్లారిటీ ఇచ్చింది. అయినా.. ఆ ప్రచారానికి పులిస్టాప్ పడటం లేదు. తాజాగా, సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనుంది అనే న్యూస్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2019 మార్చి కల్లా చేతిలో ఉన్న సినిమాలని పూర్తి చేసి.. సామ్ విశ్రాంతి తీసుకోనుందట. ఇందులో నిజమెంత ? అనేది తెలియరాలేదు.

అది తాత్కఌక విరామం అయి ఉంటుందని ఆమె అభిమానులు అంటున్నారు. మరికొందరు చైతూ-సామ్ జంట బిడ్డని కనాలని ఆశపడుతోంది. బహుశా.. సామ్ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. అందుకే సినిమాలని ప్రక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటుందేమోనని చెబుతున్నారు. మొత్తానికి.. సినిమాలకు సామ్ గుడ్ బై న్యూస్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇక, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలు చైతూ-సామ్ జంటగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ పెళ్లైన జంటగా కనిపించబోతున్నారు.