కీర్తీ సురేష్’పై శింబు కన్నుపడింది

ప్రేమ వ్యవహారాలు నడపడంతో కోలీవుడ్ యంగ్ హీరో శింబు స్పెషలిస్టు. గతంలో నయనతార, హన్సిక.. తదితరులతో ఎఫైర్స్ నడిపాడు. ఇప్పుడీ సంచలన నటుడు కన్ను హీరోయిన్ కీర్తి సురేష్ పై పడినట్టు కోలీవుడ్ సమాచారమ్. కాస్త గ్యాప్ తర్వాత సినిమాల విషయంలో స్వీడు పెంచాడు శింబు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో ‘ సెక్క సివంద వానం’ షూటింగ్ ని పూర్తి చేశాడు. ఇదీగాక, మూడ్నాలుగు కథలని కథలని ఓకే చేశాడు. ఇందులో వెంకట్ ప్రభు సినిమా ఒకటి.

ఈ సినిమాలో శింబుకు జోడీగా కీర్తి సురేష్’ని తీసుకోవాలని ట్రై చేస్తున్నారంట. ‘మహానటి’ సినిమాతో కీర్తి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం కీర్తి కొత్త సినిమాలని ఏవీ ఒప్పుకోవడం లేదు. చేతిలో ఉన్న మూడ్నాలుగు ( విజయ్‌ ‘సర్కార్’, విశాల్‌ ‘సండైక్కోళి 2’, విక్రమ్‌ ‘సామి స్క్వేర్‌’) సినిమాలని పూర్తి చేసే పనిలో ఉంది. ఆ తర్వాతే కొత్త కథలని ఓకే చేయాలని నిర్ణయించుకొంది. ఈ నేపథ్యంలో శింబుతో రొమాన్స్ చేసేందుకు ఆమె ఒప్పుకుంటుందో ? లేదో ?? అన్నది ఆసక్తిగా మారింది. శింబు మాత్రం కీర్తినే కావాలనే పట్టుబడుతున్నాడట. చూస్తుంతే శింబు కన్ను కీర్తిపై పడినట్టుంది.. !