మెగా పిక్ : చెడ్డీలో పవన్.. ఫ్యాన్స్ ఖుషీ

సినిమాలకు పులిస్టాప్ పెట్టేసి.. పొలిటిక్స్ లో బిజీ అయిపోయాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో జనసేనని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటనని పూర్తి చేశాడు. ప్రస్తుతం విశాఖపట్నంలో పవన్ ఉన్నాడు. విశాఖలో నేతలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతూ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పవన్ వరుస ట్విట్స్ చేశాడు. మధ్యలో ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటోని కూడా పోస్ట్ చేశారు పవన్.

అది పవన్ ఏడో క్లాసులో దిగిన ఫోటో. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మెగాస్టార్‌ చిరంజీవి, నాగబాబులు ఉన్నారు. పవన్‌, అక్కా చెల్లెళ్లూ ఉన్నారు. ‘అప్పుడు మేము నెల్లూరులో ఉన్నాం. నేను ఏడో తరగతి చదువుతున్నా. చాలా కాలం బ్రాంకైటిస్‌తో బాధపడ్డా. ఆ అస్వస్థత నుంచి బయటపడ్డాక ఈ ఫొటో తీసుకున్నాం’ అంటూ ఆ ఫోటో తాలుకు తీపి గుర్తులని అభిమానులతో పంచుకొన్నారు. ఇప్పుడీ ఫోటో మెగా అభిమానులని, జనసేన శ్రేణులకు ఖుషి చేస్తోంది.

పవన్ ఏపీకి కాబోయే సీఎం అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై విశాఖ గాజువాక కూడలిలో గురువారం జరిగిన బహిరంగ సభలో పవన్ స్పందించారు. భగవంతుడి దయ, అభిమానుల ఆశీస్సులు ఉంటే సీఎంని అవుతానని పవన్‌ అన్నారు. డబ్బుతో రాజకీయం చేయలేమని, అలా అయితే జగన్‌ ఎపుడో సీఎం అయ్యేవారన్నారు. సినిమాల ద్వారా సంపాదించుకొనే అవకాశం ఉండీ.. రాజకీయాల్లోకి వచ్చానని, జవాబుదారీతనం పెంచేందుకే తన ప్రయత్నమన్నారు పవన్.

ఇన్నాళ్లు పవన్ పార్ట్ టైం పొలిటిషన్ అనే కామెంట్స్ వినిపించేవి. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ పూర్తి స్థాయి రాజకీయ నేతగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఓ రాజకీయా పార్టీ లక్ష్యం అధికారం, ఆ అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకు సేవ చేయడమే కదా.. ! ఇప్పుడు పవన్ అదే చేస్తున్నాడు. మరీ.. పవన్ ప్రయత్నం ఫలిస్తుందా.. ? ఆయన ఏపీకి సీఎం అవుతాడా.. ??? అనేది తెలియాలంటే మరో 10నెలలు ఓపిక పట్టాల్సిందే. మరో 10 నెలల్లో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.