గాంధీ భవన్ సమీపంలో అంజన్ కుమారుడి వీరంగం..!!

గాంధీ భవన్ సమీపంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అరవింద్ కుమార్ యాదవ్ వీరంగం సృష్టించాడు.NSUI ఎన్నికల్లో తన బామ్మమర్ధి సుకేశ్ యాదవ్ కు వ్యతిరేకంగా పనిచేసిన అభిజిత్ యాదవ్ పై దాడి చేసాడు. అరవింద్ యాదవ్ పై బేగం బజార్ పియస్ లో ఫిర్యాదు చేశారు బాధితులు.

శుక్రవారం జరిగిన ఎన్ యస్ యూ ఐ ఎన్నికల్లో సిటీ యూత్ ప్రెసిడెంట్ గా గెలుపొందిన అభిజిత్ అతని అనుచరులపై అరవింద్ కుమార్ యాదవ్ తన అనుచరులతో కలిసి అభిజిత్ వర్గం పై దాడికి పాల్పడ్డారు.
తన ఇంటిపై కూడా దాడికి పాల్పడ్డారని బేగం బజార్ పీఎస్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. తమ విజయాన్ని తట్టుకోలేకే తమపై దాడికి పాల్పడ్డారని, వెంటనే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధితులు.ఇలా దాడులకు పాల్పడుతున్న వారిని పార్టీకి దూరంగా ఉంచాలని, దీనిపై కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తామని బాధితులు చెప్పారు.