శ‌ర‌త్ కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శ‌

అమెరికాలో జరిగిన కాల్పులలో చనిపోయిన శరత్ కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శించారు. మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు త‌ల‌సాని, క‌డియం, ఎంపీ బాల్క సుమ‌న్ అమీర్ పేట్ లోని శ‌ర‌త్ నివాసానికి వెళ్లారు. దౌత్య సిబ్బంది తో మాట్లాడమని, హత్య పై విచారణ జరుగుతుందని అక్కడ అధికారులు చెప్పార‌ని మ‌త్రి కేటీఆర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు. కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లాల‌నుకుంటే ప్రభుత్వ ఖర్చులతో పంపిస్తామ‌ని హామీ ఇచ్చారు కేటీఆర్. శరత్ డెడ్ బాడీ రెండు రోజులో హైదరాబాద్ కు వచ్చేలా అక్కడి అధికారులతో మాట్లాడామని చెప్పారు.