నేడు జనసేనలోకి చిరు అభిమానులు..!

మెగాస్టార్ చిరు అభిమానులు జ‌న‌సేనలో చేర‌తార‌ని గ‌త కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే అందుకు నేడు ముహూర్తం కుదిరింది. ఈ సాయంత్రం 3.30 గంట‌ల‌కు ప‌వ‌న్ స‌మ‌క్షంలో చిరు అభిమాన సంఘాల నాయ‌కులు జ‌న‌సేన తీర్థం పుచ్చుకోనున్నారు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని సంధ్య క‌న్వెన్ష‌న్ హాల్లో జ‌న‌సేన ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. పార్టీలో చేరిక‌ల అనంత‌రం చిరు అభిమాన సంఘాల నేత‌ల‌తో ప‌వ‌న్ స‌మావేశ‌మవుతారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన చిరు అభిమాన‌ సంఘాల నేతలు, అభిమానులు హైద‌రాబాద్ చేరుకున్నారు.