స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్ ..!

క‌త్తి మ‌హేష్ వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ హైద‌రాబాద్ బోడుప్ప‌ల్ నుంచి యాదాద్రి వ‌ర‌కు ధ‌ర్మాగ్ర‌హ యాత్ర పేరుతో పాద‌యాత్ర‌కు సిద్ధ‌మైన స్వామి ప‌రిపూర్ణానందను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రెండు రోజుల పాద‌యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో జూబ్లీహిల్స్ లోని స్వామీజీ ఇంటి వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు. రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ స్వామిజీని హౌస్ అరెస్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ధ‌ర్మాగ్ర‌హ యాత్ర‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. యాత్ర‌తో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని, అందుకే అనుమ‌తి నిరాక‌రిస్తున్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. పాద‌యాత్ర భ‌గ్నం చేసిన నేప‌థ్యంలో స్వామిజీ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌ట‌న‌పై సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.