రిమ్స్‌ నుంచి శిశువు అపహరణ.. కథ సుఖాంతం

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో మగశిశువు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ కేసు మిస్టరీని కొన్ని గంటల్లోనే పోలీసులు ఛేదించారు. శిశువును అపహరించిన మహిళను ఇచ్చోడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిశువుని తిరిగి తల్లి వడికి చేర్చారు.

నార్మూర్‌ మండలం చోర్‌గామ్‌కు చెందిన మమత డెలివరీ కోసం ఈ నెల 2న రిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 7న ఆమె మగశిశువుకు జన్మనిచ్చారు. మంగళవారం తెల్లవారుజామున చిన్నారి మాయమైంది. దీంతో మమత బంధువులు రిమ్స్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగినపోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. పట్టణంలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసి.. శిశువుతో అనుమానాస్పదంగా కనిపించిన పుష్పలతను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు లేకపోవడంతోనే శిశువును అపహరించానని నిందితురాలు పుష్పలత అంగీకరించారు.