ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌

జియో దెబ్బకు మిగితా టెలికాం కంపెనీలు భారీ నష్టాలని చవి చూడాల్సి వచ్చింది. జియో నుంచి పోటీని తట్టుకోవడానికి వోడాఫోన్, ఐడియా కలిసిపోయాయి కూడా. ఇప్పుడు వోడాఫోన్ ఐడియా సరికొత్త ఆఫర్స్ ని ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే వొడాఫోన్‌ తన రెడ్‌ పోస్టు పెయిడ్‌ ప్లాన్లు రూ.399ను, రూ.2,999ను సమీక్షించింది. వొడాఫోన్‌ సమీక్షించిన ప్లాన్లపై అపరిమిత కాల్స్‌ను, 300 జీబీ వరకు డేటాను, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది.

ఆ ఆఫర్లతోనే కాక వొడాఫోన్‌ ప్లే, మొబైల్‌ షీల్డ్‌, రెడ్‌ హాట్‌ డీల్స్‌, బిల్‌ గ్యారెంటీ వంటి ఉచితంగా లభించనున్నాయి. ఇదీగాక, కొత్త రూ. 299 రెడ్‌ బేసిక్‌ పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద 20 జీబీ డేటాను ఆఫర్‌ చేస్తోంది. మరోవైపు జియోగిగాఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కౌంటర్‌గా కంపెనీ తన ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌

దీనికి కౌంటర్‌గా ఎయిర్‌టెల్‌ సైతం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తన రూ.499 పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ను సమీక్షిస్తున్నట్టు తెలిపింది. ఈ సమీక్షించిన ప్లాన్‌ కింద 87.5 శాతం ఎక్కువ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ప్రకటించింది. అంతకముందు ఈ ప్లాన్‌ కింద కేవలం 40 జీబీ డేటా మాత్రమే సబ్‌స్క్రైబర్లకు లభించేది. ప్రస్తుతం 75 జీబీ డేటా లభ్యం కానుంది. దీనిలోనే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేయనుంది. ఒక నెలలో వాడుకోని డేటాను మరో నెలకు యాడ్‌ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.