మహేష్’ని పక్కన పెట్టిన సుక్కు ?

దర్శకుడు సుకుమార్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాని పక్కన పెట్టేసినట్టే కనబడుతోంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మహేష్ ‘వన్-నేనొక్కడినే’ సినిమా ప్లాప్ అయ్యింది. ఐతే, ‘రంగస్థలం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న సుక్కుకు మరో అవకాశం ఇచ్చాడు మహేష్. ఈ సారి మహేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో సుకుమార్ ఉన్నాడు. మహేష్ కోసం ఓ మంచి కథని రెడీ చేసే పనిలో ఉన్నాడని చెప్పుకొన్నారు. ప్రస్తుతం మహేష్ తన 25వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సుక్కు సినిమా ఉంటుందని అనుకొన్నారు. ఐతే, ఇంతలో సుక్కుకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. దీంతో సుక్కు మహేష్ సినిమాని పక్కన పెట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో సుక్కు ఓ సినిమా చేయబోతున్నాడట. అది కూడా ‘రంగస్థలం’ రిమేక్ అని చెబుతున్నారు. సుక్కు బాలీవుడ్ కు వెఌతే తిరిగి వచ్చేసరికి చాలా సమయమే పడుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ తో సుక్కు చేయబోయే సినిమా డైలమాలో పడినట్టు కనబడుతోంది. మరీ.. నిజంగానే సుక్కు మహేష్ ని వదిలేస్తాడా.. ? లేదంటే బాలీవుడ్ కు వెళ్లినా.. అక్కడ కాస్త విరామం తీసుకొని మహేష్ సినిమాని డీల్ చేస్తాడా.. ?? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ వంశీపైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తన 25వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా డెహ్రాడూన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. త్వరలోనే హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.