తేజు తిరుమల మొక్కు.. తీరేనా !

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు మాస్ వెంట పరుగెత్తాడు. వరుసగా మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మొదట ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు.. ఆ తర్వాత తేజు యాక్షన్ రొటీన్ అంటూ బోర్ గా ఫీలయ్యారు. దీంతో తేజుని వరుస ప్లాపులు పలకరించాయి. తిక్క, విన్నర్, జవాన్, ఇంటిలిజెంట్ సినిమాలు ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో తేజు రూటు మార్చాడు. మాస్ ని వదిలి రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేశాడు.

ప్రేమకథల స్పెషలిస్టు కరుణాకరణ్ దర్శకత్వంలో ‘తేజు ఐ లవ్ యు’ సినిమా చేశాడు. రాశీఖన్నా హీరోయిన్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన తేజు లవ్ స్టోరీ ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఫలితంగా తేజు ఖాతాలో మరో ప్లాపు పడినట్టయింది. వరుసగా ఐదు ప్లాపులు మూటగట్టుకొన్న తేజు పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పుడీ యంగ్ హీరో ఆశలన్నీ తిరుమలపైనే పెట్టుకొన్నాడు.

నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. తేజు తదుపరి సినిమా తిరుమల దర్శకత్వంలో ఉండనుంది. ఈ నేపథ్యంలో తేజు తిరుమలనే నమ్ముకున్నాడని చెబుతున్నారు. మరీ.. ఈ యంగ్ హీరోని తిరుమల గట్టేక్కిస్తాడా.. ? తేజు తిరుమల మొక్కు తీరుతుందా ?? అనేది చూడాలి.