ల‌క్ష్మ‌ణ్’కు రామ‌న్న స‌వాల్

రాష్ట్ర అద్య‌క్షులు ల‌క్ష్మ‌ణ్ పై మంత్రి జోగు రామ‌న్న ఫైర్ అయ్యారు. బీజేపీ నాయ‌కుల మాట‌లు మాయ‌ల ఫ‌కీర్‌ను త‌ల‌పించేవిగా ఉన్నాయ‌ని మంత్రి విమ‌ర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జా క్షేత్రంలో బీజేపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మునిగిపోయే ప‌డ‌వ బీజేపీదేన‌ని ఆయ‌న అన్నారు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే తెలంగాణ ప్ర‌జ‌లు స‌హించ‌ర‌ని, బీజేపీని బండ‌కేసీ ఉత‌క‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మ‌తి భ్ర‌మించిన బీజేపీ నాయ‌కులు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని మంత్రి జోగు రామ‌న్న ధీమాగా చెప్పారు. టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి రాకుంటే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని , టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే రాజ‌కీయ ల‌క్ష్మ‌ణ్ స‌న్యాసం తీసుకుంటారా అంటూ స‌వాల్ విసిరారు. అవినీతిని పెంచిపోషిస్తున్న బీజేపీ పాల‌న‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ బీజేపీయేన‌ని ఆయ‌న అన్నారు. బీజేపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వేలాది కోట్ల రూపాయ‌లు ప్ర‌జా ధ‌నాన్ని మింగేసీన నీర‌బ్ మోది, విజ‌య్ మాల్యా వంటి ప్ర‌ముఖులు ద‌ర్జాగా విదేశాల్లో తిరుగుతున్నా.. వారిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్న‌మే చేయ‌ని బీజేపీ పెద్ద‌లు త‌మ‌ను విమ‌ర్శిస్త‌రా అని ప్ర‌శ్నించారు.