రామోజీ, సైనా నెహ్వాల్ ను క‌లిసిన అమిత్ షా..!!


హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షులు ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావు, బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ను క‌లిసారు. బీజేపీ నేత‌ల‌తో పార్టీ కార్యాల‌యంలో స‌మావేశ‌మైన అనంత‌రం రామోజీరావును క‌లిసారు. ఆ త‌రువాత సైనా నెహ్వాల్ ఇంటికి వెళ్లి ఆమెను క‌లిసి అభినందించారు. అయితే అమిత్ , రామోజీ భేటీపై రాజ‌కీయ ప్రాధాన్య‌త ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

సంప‌ర్క్ సే సంవ‌ర్థ‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా మీడియా దిగ్గ‌జం రామోజీరావును క‌లిసి ఆయ‌న‌కు జ్ఞాపిక‌ను అందించారు. బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ను క‌లిసి ఆమెకు కూడా జ్ఞాపిక‌ను అంద‌జేసి అబినందించారు. అయితే రామోజీని క‌ల‌వ‌డం వెన‌క ఏదైనా రాజ‌కీయ వ్యూహం దాగుంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తోంది. అమిత్ షా వెంట బీజేపీజాతీయ కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్ రావు, రాష్ట్ర అధ్య‌క్షులు ల‌క్ష్మ‌ణ్, కేంద్ర మాజీ మంత్రి ద‌త్తాత్రేయ‌, కిష‌న్ రెడ్డి, చింత‌ల ఉన్నారు.