మ‌న‌సు మార్చుకున్న అమిత్ షా..! నిరుత్సాహప‌డ్డ కార్య‌క‌ర్త‌లు..!!

బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైద‌రాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కార్య‌క‌ర్త‌ల‌కు అభివాదం చేశారు. అయితే అక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి అమిత్ షా మాట్లాడ‌తార‌ని అంద‌రూ భావించారు. కానీ కార్య‌క‌ర్త‌ల‌కు అభివాదం అనంత‌రం హోట‌ల్ క‌త్రియాకు వెళ్ళిపోయారు అమిత్ షా.

షెడ్యూలు ప్ర‌కారం బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్న అమిత్ షా ప‌ది నిమిషాలు కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తార‌ని నిర్ణ‌యించారు. అయితే మ‌న‌సు మార్చుకున్న అమిత్ షా మాట్లాడ‌కుండానే వెళ్లిపోయారు. అమిత్ షా మాట్లాడ‌కుండా వెళ్లిపోవ‌డంతో కాస్త నిరుత్సాహానికి గుర‌య్యారట కార్య‌క‌ర్త‌లు.