‘నీవెవరో’ టీజర్ టాక్

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కెతున్న చిత్రం ‘నీవెవరో’. ఈ చిత్రం ద్వారా హ‌రినాధ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. క‌న్న‌డ చిత్రం ‘అదే కంగ‌ల్’ కు రీమేక్ ఇది. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఆది అంధుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఒరిజినల్ వెర్షన్‌లో కలైయారసన్‌ హరికృష్ణనన్‌ కనిపించిన పాత్ర ఇది. తాజాగా, ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

‘మూడు నగరాలు, రెండు ప్రేమకథలు.. ఒక్క సంఘటన… ‘ అంటూ ఆది వాయిస్ తో టీజర్ మొదలైంది. ఆ వెంటనే ఆదికి యాక్షిడెంటు. దానికి సంబంధించి ఇది యాక్సిడెంటు కాదు.. సర్.. ఇట్స్ మర్డర్ అంటూ ఫీ మేల్ వాయిస్ వినిపించింది. చివరల్లో.. ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు సమాధానం ఏదో రూపంలో వస్తుంది. నాకే రూపంలో వస్తుందో చూడాలని ఉందని ఆది చెప్పడం ఆకట్టుకొంది. మొత్తంగా.. థ్రిల్లింగ్, యాక్షన్ సీన్స్ తో టీజర్ ని ఆకట్టుకొనేలా కట్ చేశారు. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండీ.. !