బీజేపీ ఛ‌లో ప్ర‌గ‌తి భ‌వ‌న్..! నేత‌ల అరెస్టు …!!

పరిపూర్ణనంద స్వామి పై నగర బహిష్కరణ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజేపి ఛలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చింది. బిజేపి ఆఫీసు నుండి ప్రగతి భవన్ కు ర్యాలీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి బీజేపీ శ్రేణులు. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలో పోలీసులు భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. బీజేపీ ముఖ్య నేత‌ల‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్క‌డిక్క‌డ ర్యాలీని నిలువ‌రించేందుకు అన్ని దారుల్లో భారీ భ‌ధ్ర‌త ఏర్పాటు చేశారు పోలీసులు. అవ‌స‌ర‌మున్న చోట ముంద‌స్తు అరెస్టులు చేశారు.

సిఎం కేసిఆర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలంతా బిజేపి ఆఫీసుకు రావాలని ఆ పార్టీపిలుపునిచ్చింది. ముందుగా బిజేపి ఎల్ పి నేత కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాం చందర్ రావులను గృహ నిర్భందం చేశారు పోలీసులు. ఇంటి నుంచి ర్యాలీగా బ‌య‌లుదేరిన ఎమ్మెల్సీ రామ‌చంద‌ర్ రావును ఓయూ పోలీసులు అరెస్టు చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ల‌క్ష్మ్‌ణ్ ను ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్ వ‌ద్ద‌, బీజేపీ ప్లోర్ లీడర్ కిష‌న్ రెడ్డిని మ‌రోచోట అరెస్టు చేశారు పోలీసులు. సాయంత్రం వ‌ర‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో బీజేపీ ఛ‌లో ప్ర‌గ‌తి భ‌వ‌న్ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌కుండా పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు.