ఎమ్మెల్యే ఆస్తుల‌పై హైకోర్టులో వ్యాజ్యం..!!


మంథనిఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఆస్తుల పై హైకోర్టు లో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖ‌లైంది. మంథని శాసనసభ్యుడు పుట్టా మధుకర్ అతని కుటుంబ సభ్యులు పై ఉన్న ఆస్తులపై విచారణ జరపాలని పిటీషనర్ పేర్కొన్నాడు. ఎమ్మెల్యే సుమారు 176 కోట్ల విలువ చేసే అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని పిటిష‌న‌ర్ ఆరోపించారు. అతని ఆస్తుల‌పై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని పిటిష‌న‌ర్ కోరారు.

పుట్టా లింగమ్మ ఛారిటబుల్ ట్రస్టుకు 12A మరియు 80(G) కింద పర్మిషన్ ఇవ్వరాదని కూడా పిటిష‌న‌ర్ కోరారు. మంథ‌నికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ ఉమ్మడి హైకోర్టు లో ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిష‌న్ పై హైకోర్టు విచారించ‌నుంది.