గోవా వెళ్తున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు గోవా వెళ్లనున్నారు. ఇదో ఫ్యామిలీ ట్రిప్ కాదు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తొలి షెడ్యూల్ ని డెహ్రాడూన్ లో పూర్తి చేసుకొంది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్రబృందం గోవా వెళ్లనుంది. అక్కడ మహేష్, పూజా హెగ్డేలపై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు కాలేజ్ స్టూడెంట్’గా, రైతుబిడ్డగానూ కనిపించబోతున్నాడు. రెండు డిఫరెంట్ లుక్స్ తో మహేష్ అదరగొడతాడని చెబుతున్నారు. రైతు సమస్యలే మెయిన్ లైన్ గా సినిమా సాగుతుందని తెలిసింది. ఈ సినిమాకి ‘రాజసం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారమ్.

ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనుంది. ‘అల్లరి’ నరేశ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ సినిమాని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.