పాత‌బ‌స్తీలో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు…!

పాత బస్తి డబీర్ పురాలో పాతకక్షలు భ‌గ్గుమన్నాయి. వాటర్ ఫిల్టర్ నిర్వ‌హించే జబ్బెర్ ఖురేషీ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడి లో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు దుండ‌గుల బారి నుంచి తపించుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక స్పృహ కోల్పోయాడు.గ‌మ‌నించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితున్ని హుస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

దుండ‌గుల దాడిలో ఖురేషీ మెడ భాగంలో తీవ్రంగా గాయమైందని ఎలాంటి ప్రాణహాని లేదని హాస్పిటల్ వైద్యులు తెలిపారు.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాత పేపర్ల వ్యాపారం లో లావాదేవీల వ్యవహారమే దాడికి దారితీసినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలో దాడికి సంబంధించిన‌ సీసీటీవీ రికార్డ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.