యాదాద్రిలో హుండీ లెక్కింపు..

యాదాద్రి ఆల‌యంలో గురువారం హుండీ లెక్కింపు జ‌రిగింది. ఉద‌యం 8గంట‌ల‌కు ప్రారంభ‌మైన హుడీ లెక్కింపు మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌వ‌ర‌కు కొన‌సాగింది. హుండీ లెక్కింపులో పాల్గొన్న ఆల‌య ఉద్యోగులు స్వామివారికి 22రోజుల నుంచి భ‌క్తులు స‌మ‌ర్పించిన న‌గ‌దు, బంగారం, వెండిని లెక్కించారు. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 22రోజుల హుండి ఆదాయం 69 ల‌క్ష‌ల 36వేల 805 రూపాయ‌లు. బంగారం 141గ్రాములు, వెండి 5 కిలోల 270గ్రాముల ఆదాయం ల‌భించింద‌ని యాదాద్రి ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారి తెలిపారు.